ఈనెల 28 నుంచి జరగాల్సిన తెలంగాణ ఎంసెట్ రెండో విడత కౌన్సెలింగ్ ను వాయిదా వేస్తున్నట్లు ఉన్నత విద్యా మండలి ప్రకటించింది. ఇంజినీరింగ్ ఫీజుల విషయం కొలిక్కి రాకపోవడమే కారణమని పేర్కొంది. అక్టోబర్ 11 నుంచి కౌన్సెలింగ్ ప్రారంభిస్తామని తెలిపింది. 11, 12న స్లాట్ బుకింగ్, 12న ధ్రువపత్రాల పరిశీలన, 12, 13న వెబ్ ఆపన్ల నమోదు, 16న సీట్ల కేటాయింపు ఉంటుందని వెల్లడించింది.