వాటర్ ట్యాంకర్ ద్విచక్ర వాహనాన్ని ఢీకొని యువకుడు మృతి చెందిన సంఘటన నాగర్ కర్నూల్ జిల్లా, అచ్చంపేట మండలం పరిధిలోని అయినోలు గ్రామ శివారులో బుధవారం రాత్రి చోటు చేసుకుంది. గ్రామస్తులు, బంధువులు తెలిపిన వివరాల ప్రకారం, గ్రామానికి చెందిన లక్ష్మీపతి ( 38) అచ్చంపేట నుండి అయినోలు కు వెళ్తున్న సమయంలో ఎదురుగా వస్తున్న వాటర్ ట్యాంక్ ఢీకొట్టడంతో లక్ష్మీపతి అక్కడికక్కడే మృతి చెందినట్లు గ్రామస్తులు తెలిపారు. మృతునికి భార్య, ఒక కూతురు ఉన్నారు.