ట్రెండింగ్
Epaper    English    தமிழ்

తన తదుపరి చిత్రంలో ఐశ్వర్య లక్ష్మితో రొమాన్స్ చేయనున్న మెగా హీరో

cinema |  Suryaa Desk  | Published : Wed, Jul 17, 2024, 12:28 PM

మెగా సుప్రీమ్ హీరో సాయి దుర్ఘ తేజ్ తన తదుపరి చిత్రాన్ని రోహిత్ కెపిని తో ప్రకటించిన సంగతి అందరికి తెలిసిందే. 'SDT 18' పేరుతో ప్రకటించబడిన ఈ చిత్రం తెలుగు, తమిళం, హిందీ, కన్నడ మరియు మలయాళంలో పాన్-ఇండియా ప్రాజెక్ట్‌గా విడుదల కానుంది. ఇటీవల హైదరాబాద్‌లో వేసిన భారీ సెట్‌లో చిత్ర బృందం తొలి షెడ్యూల్‌ను పూర్తి చేసుకుంది. లేటెస్ట్ రిపోర్ట్స్ ప్రకారం, ఈ సినిమాలో ఐశ్వర్య లక్ష్మి కథానాయికగా నటిస్తున్నట్లు సమాచారం. త్వరలో అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉంది. ఈ ప్రాజెక్ట్ 100-120 కోట్ల బడ్జెట్‌తో రూపొందుతుంది. ప్రైమ్ షో ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై కె.నిరంజన్ రెడ్డి, చైతన్య రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com