తమిళ స్టార్ హీరో తలపతి విజయ్ వంశీ పైడిపల్లి దర్శకత్వంలో నటించిన 'వరిసు' సినిమా జనవరి 11, 2023న గ్రాండ్ గా రిలీజ్ అయ్యి విడుదలైన అన్ని చోట్ల పాజిటివ్ టాక్ ని సొంతం చేసుకుని సాలిడ్ కలెక్షన్స్ ని రాబట్టింది. తాజా అప్డేట్ ప్రకారం, ఈ చిత్రం యొక్క తమిళ వెర్షన్ ఏప్రిల్ 14, 2023న సన్ టీవీలో వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్కి సిద్ధంగా ఉంది. ఈ చిత్రం సాయంత్రం 06:30 గంటలకు ప్రసారం కానుంది అని సమచారం.
ఈ సినిమాలో విజయ్ సరసన కన్నడ బ్యూటీ రష్మిక జంటగా నటిస్తుంది. ప్రభు, ప్రకాష్ రాజ్, జయసుధ మరియు శరత్ కుమార్ ఈ చిత్రంలో కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ సినిమాకి సెన్సషనల్ మ్యూజిక్ డైరెక్టర్ థమన్ ఎస్ సంగీతం అందిస్తున్నారు. దిల్ రాజు అండ్ శిరీష్ శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్పై ఈ సినిమాని నిర్మించనున్నారు.