జి. మనోహరన్ సమర్పణలో, లహరి ఫిలిమ్స్, చాయ్ బిస్కెట్ ఫిలిమ్స్ బ్యానర్లపై అనురాగ్ రెడ్డి, శరత్ చంద్ర, చంద్రు మనోహరన్ నిర్మించిన చిత్రం "రైటర్ పద్మభూషణ్". ఈ సినిమాకు షణ్ముఖ్ ప్రశాంత్ దర్శకత్వం వహించారు. సుహాస్, టీనా శిల్పరాజ్, ఆశిష్ విద్యార్ధి, రోహిణి ప్రధాన పాత్రల్లో నటించారు. ఫిబ్రవరి 3వ తేదీన ధియేటర్లకొచ్చిన 'ఈ సినిమాకు ప్రేక్షకులు బ్రహ్మరథం పడుతున్నారు. ఫీల్ గుడ్ ఫ్యామిలీ ఎమోషనల్ డ్రామాగా ప్రేక్షకులు, క్రిటిక్స్ నుండి యూనానిమస్ గా సూపర్ హిట్ టాక్ తెచ్చుకున్న ఈ సినిమా ఈ రోజు నుండి జీ 5 ఓటిటిలో డిజిటల్ స్ట్రీమింగ్ కి వచ్చింది. థియేటర్ ఆడియన్స్ ను విశేషంగా మెప్పించిన, రైటర్ డిజిటల్ ఆడియన్స్ నుండి ఎలాంటి స్పందన దక్కించుకుంటాడో చూడాలి.