గుణశేఖర్ దర్శకత్వంలో సౌత్ ఇండియా స్టార్ బ్యూటీ సమంత 'శకుంతలం' సినిమా చేస్తున్న సంగతి అందరికి తెలిసిందే. ఈ పాన్-ఇండియన్ పీరియాడికల్ డ్రామా ప్రపంచవ్యాప్తంగా ఫిబ్రవరి 17న తెలుగు, హిందీ, తమిళం, కన్నడ, మలయాళ భాషల్లో 3డిలో థియేటర్లలోకి రానుంది. లేటెస్ట్ అప్డేట్ ప్రకారం, ప్రముఖ OTT ప్లాట్ఫారమ్ అమెజాన్ ప్రైమ్ వీడియో ఈ చిత్రం యొక్క పోస్ట్-థియేట్రికల్ హక్కులను ఫ్యాన్సీ ధరకు కొనుగోలు చేసింది.
ఈ చిత్రంలో దేవ్ మోహన్ దుష్యంత పాత్రలో నటిస్తుండగా, అల్లు అర్జున్ కూతురు అర్హ ఈ చిత్రంలో ప్రిన్స్ భరతుడిగా కనిపించనుంది. ఈ చిత్రంలో మోహన్ బాబు, అదితి బాలన్, ప్రకాష్ రాజ్, అనన్య నాగళ్ల, గౌతమి, కబీర్ బేడీ, మధుబాల, కబీర్ దుహన్ సింగ్ ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. మణిశర్మ ఈ సినిమాకి సంగీతం అందించాడు.