టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు దర్శకుడు త్రివిక్రమ్ కాంబినేషన్ లో సినిమా వస్తుంది అని అందరికి తెలిసిన విషయమే. ఈ మూవీకి టెంపరరీగా 'SSMB28' అని టైటిల్ మూవీ మేకర్స్ లాక్ చేసారు. ఈ సినిమాలో మహేష్ సరసన సిజ్లింగ్ బ్యూటీ పూజా హెడ్గే జోడిగా నటిస్తుంది. ఈ చిత్రాన్ని ఆగస్టు 11, 2023న విడుదల చేయడానికి మూవీ మేకర్స్ ప్లాన్ చేస్తున్నట్లు వారాలు వినిపిస్తున్నాయి.
ఈ సినిమా టైటిల్, ఫస్ట్ లుక్ పోస్టర్ ఇంకా విడుదల కాలేదు కానీ ఈ సినిమా ట్రేడ్ వర్గాల్లో సంచలనం సృష్టిస్తోంది. ఈ చిత్రం యొక్క డిజిటల్ హక్కులను ప్రముఖ OTT ప్లాట్ఫారం నెట్ఫ్లిక్స్ 81 కోట్లకు కొనుగోలు చేసింది, ఇది తెలుగు సినిమాకి సంబంధించిన అత్యధిక డీల్. ఈ సినిమా అన్ని ఏరియాల థియేట్రికల్ రైట్స్కు కూడా భారీ డిమాండ్ ఏర్పడింది. ముఖ్యమైన విషయం ఏమిటంటే, ఈ సినిమా థియేట్రికల్ రన్ అయిన 50 రోజుల తర్వాత OTTలో ప్రీమియర్ గా ప్రదర్శించబడుతుంది అని సమాచారం.
ఫ్యామిలీ ఎంటర్టైనర్ ట్రాక్ లో రానున్న ఈ సినిమాని హారిక అండ్ హాసిని క్రియేషన్స్ నిర్మిస్తుంది. ఈ సినిమాకి థమన్ సంగీతం అందిస్తున్నారు.