"మహానటి" తో జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్న డైరెక్టర్ నాగ్ అశ్విన్ తదుపరి పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ను పాన్ వరల్డ్ స్టార్ గా మార్చే ప్రయత్నం చేస్తున్న విషయం తెలిసిందే. ఈ ఇద్దరి కాంబోలో ప్రాజెక్ట్ కే వర్కింగ్ టైటిల్ తో ఒక భారీ బడ్జెట్ సినిమా రూపొందుతుంది. ఈ సినిమాను ప్రముఖ వైజయంతీ మూవీస్ పతాకంపై అశ్వినీదత్ నిర్మిస్తున్నారు. కాగా, ఆదివారం హైదరాబాద్లోని గచ్చిబౌలిలో వైజయంతీ మూవీస్ కొత్త ఆఫీస్ ప్రారంభ కార్యక్రమం చాలా గ్రాండ్ గా జరిగింది.
ఈ కార్యక్రమంలో ప్రాజెక్ట్ కే టీం తరపున ప్రభాస్, నాగ్ అశ్విన్, అమితాబ్ బచ్చన్ పాల్గొనగా, దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు, డైరెక్టర్ ప్రశాంత్ నీల్, నాచురల్ స్టార్ నాని, మలయాళ స్టార్ హీరో దుల్కర్ సల్మాన్ తదితర ప్రముఖులు పాల్గొన్నారు. వీరందరూ కలిసి దిగిన ఒక ఫోటో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. ప్రాజెక్ట్ కే సినిమాను, దుల్కర్ సల్మాన్ హీరోగా నటిస్తున్న సీతారామం సినిమాలను వైజయంతి మూవీస్ నిర్మిస్తుంది. సో... వాళ్ళందరూ ఈ పార్టీలో తప్పక పాల్గొనాల్సిన పరిస్థితి. మరి ఈ పార్టీలో అదనంగా నాని ఎందుకున్నట్టు అని కొంతమంది ఆరా తీస్తున్నారు.