ట్రెండింగ్
Epaper    English    தமிழ்

విజయవాడ కనకదుర్గమ్మను దర్శించుకున్న గోపీచంద్, మారుతి

cinema |  Suryaa Desk  | Published : Sat, Jun 25, 2022, 01:03 PM

మారుతి డైరెక్షన్లో యాక్షన్ హీరో గోపీచంద్ నటించిన చిత్రం "పక్కా కమర్షియల్". గీతా ఆర్ట్స్, యూవీ క్రియేషన్స్ సంయుక్తంగా నిర్మించిన ఈ సినిమాలో రాశిఖన్నా కథానాయికగా నటించింది. కోవిడ్ కారణంగా విడుదల వాయిదా పడుతూ వచ్చిన ఈ మూవీ ఎట్టకేలకు జూలై 1వ తేదీన ప్రేక్షకులను పలకరించనుంది. కొన్ని రోజుల నుండి మూవీ టీం మొత్తం వరస ప్రచార కార్యక్రమాల్లో పాల్గొంటూ మూవీ పై మంచి బజ్ ను క్రియేట్ చేస్తున్నారు. ఈ క్రమంలో జూన్ 25 ఉదయం విజయవాడలో , సాయంత్రం వైజాగ్ లో ప్రేక్షకులతో లైవ్ ఇంటిరాక్షన్ లను నిర్వహించింది పక్కా కమర్షియల్ మూవీ టీం. ఈ సందర్భంగా, కొద్దిసేపటి క్రితమే విజయవాడ చేరుకున్న గోపీచంద్, మారుతి నేరుగా ఇంద్రకీలాద్రి పై కొలువైవున్న అమ్మవారిని దర్శించుకున్నారు. ఆపై రాజ్ యువరాజ్ ధియేటర్ లో జరగబోయే లైవ్ ఇంటిరాక్షన్ లో పాల్గొంటారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com