మారుతి డైరెక్షన్లో యాక్షన్ హీరో గోపీచంద్ నటించిన చిత్రం "పక్కా కమర్షియల్". గీతా ఆర్ట్స్, యూవీ క్రియేషన్స్ సంయుక్తంగా నిర్మించిన ఈ సినిమాలో రాశిఖన్నా కథానాయికగా నటించింది. కోవిడ్ కారణంగా విడుదల వాయిదా పడుతూ వచ్చిన ఈ మూవీ ఎట్టకేలకు జూలై 1వ తేదీన ప్రేక్షకులను పలకరించనుంది. కొన్ని రోజుల నుండి మూవీ టీం మొత్తం వరస ప్రచార కార్యక్రమాల్లో పాల్గొంటూ మూవీ పై మంచి బజ్ ను క్రియేట్ చేస్తున్నారు. ఈ క్రమంలో జూన్ 25 ఉదయం విజయవాడలో , సాయంత్రం వైజాగ్ లో ప్రేక్షకులతో లైవ్ ఇంటిరాక్షన్ లను నిర్వహించింది పక్కా కమర్షియల్ మూవీ టీం. ఈ సందర్భంగా, కొద్దిసేపటి క్రితమే విజయవాడ చేరుకున్న గోపీచంద్, మారుతి నేరుగా ఇంద్రకీలాద్రి పై కొలువైవున్న అమ్మవారిని దర్శించుకున్నారు. ఆపై రాజ్ యువరాజ్ ధియేటర్ లో జరగబోయే లైవ్ ఇంటిరాక్షన్ లో పాల్గొంటారు.