కమల్ హాసన్ హీరోగా నటించిన సినిమా ‘విక్రమ్’. ఈ సినిమాకి లోకేష్ కనకరాజ్ దర్శకత్వం వహించారు. ఈ సినిమాలో విజయ్ సేతుపతి, ఫహద్ ఫాజిల్ కీలక పాత్రల్లో నటించారు. ఈ సినిమాలో తమిళ స్టార్ హీరో సూర్య అతిథి పాత్రలో నటించారు.ఇటీవలే ఈ సినిమా విడుదలై బ్లాక్ బస్టర్ విజయం సాధించింది. తాజాగా ఈ సినిమా ఓటిటిలో ప్రసారం కానుంది.ఈ సినిమా ప్రముఖ ఓటిటి సంస్థ డిస్నీ ప్లస్ హాట్ స్టార్'లో జూలై 8 నుండి స్ట్రీమింగ్ కానుంది.