పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, బాలీవుడ్ డైరెక్టర్ ఓం రౌత్ కాంబోలో "ఆదిపురుష్" అనే మైథలాజికల్ మూవీ తెరకెక్కిన విషయం తెలిసిందే. ఈ మూవీ షూటింగ్ ఎప్పుడో పూర్తయింది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులను జరుపుకుంటున్న ఈ మూవీ వచ్చే సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇందులో శ్రీరామునిగా ప్రభాస్, సీతగా కృతి సనన్, రావణుడిగా సైఫ్ అలీఖాన్ నటించారు. ఇదిలా ఉంటే, తాజాగా ఈ రోజు తెల్లవారు ఝామున ఆది పురుష్ టీం మొత్తం డైరెక్టర్ ఓం రౌత్ ఇంట్లో రహస్యంగా సమావేశమయ్యారు. వీరంతా పొద్దున్నే ఎందుకు వచ్చారనే ప్రశ్నకు ఓంరౌత్ తన ఇంటి వద్ద ఏదో పార్టీ ఇస్తున్నాడనే సమాధానం వినబడుతోంది. అలాగే, ఈ మీటింగ్ ఆదిపురుష్ కి సంబంధించి కూడా అయ్యి ఉండొచ్చని ఇంట్రెస్టింగ్ టాక్ ఉంది. ఓం రౌత్ ఇంటికి చేరుకున్న ప్రభాస్, సైఫ్ అలీఖాన్, కృతిసనన్ పిక్స్ నెట్టింట సందడి చేస్తున్నాయి.