ట్రెండింగ్
Epaper    English    தமிழ்

వైజాగ్‌లో అభిమానులను కలవనున్న 'బ్రహ్మాస్త్ర' టీమ్

cinema |  Suryaa Desk  | Published : Sat, May 28, 2022, 07:10 PM

దర్శకుడు అయాన్ ముఖర్జీ బాలీవుడ్ స్టార్ హీరో రణబీర్ కపూర్ తో 'బ్రహ్మాస్త్ర' సినిమా చేస్తున్న సంగతి తెలిసందే. మాగ్నమ్ ఓపస్ బ్రహ్మాస్త్ర సినిమా సెప్టెంబర్ 9, 2022న ప్రపంచవ్యాప్తంగా థియేటర్‌లలో విడుదల కానుంది. అమితాబ్ బచ్చన్, అలియా భట్, మౌని రాయ్ అండ్ నాగార్జున అక్కినేని ఈ సినిమాలో కీలక పాత్రలలో కనిపించనున్నారు. ఈ చిత్రం 5 భారతీయ భాషలలో హిందీ, తమిళం, తెలుగు, మలయాళం అండ్ కన్నడ భాషలలో విడుదల కానుంది. తాజా రిపోర్ట్స్ ప్రకారం, హ్యాండ్సమ్ హంక్ రణబీర్ కపూర్, దర్శకుడు అయాన్ ముఖర్జీ మరియు లెజెండరీ ఫిల్మ్ మేకర్ ఎస్.ఎస్.రాజమౌళి మే 31వ తేదీ మంగళవారం నాడు విశాఖపట్నం సందర్శించనున్నారు అని సమాచారం. వైజాగ్ సందర్శన సమయంలో ప్రఖ్యాత మరియు చారిత్రాత్మకమైన సిమాచలం దేవాలయంలో మొదట ఆశీర్వాదం తీసుకుంటారని మరియు ఐకానిక్ మెలోడీ థియేటర్‌లో అభిమానులను కలుస్తారని వార్తలు వినిపిస్తున్నాయి. ఫాక్స్ స్టార్ స్టూడియోస్, ధర్మ ప్రొడక్షన్స్, ప్రైమ్ ఫోకస్ అండ్ స్టార్‌లైట్ పిక్చర్స్ ఈ సినిమాని నిర్మిస్తున్నాయి.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com