2019లో విడుదలై సూపర్ హిట్టైన 'మత్తు వదలరా' చిత్రంతో మ్యూజిక్ డైరెక్టర్ కీరవాణి తనయుడు శ్రీసింహ టాలీవుడ్ కి హీరోగా పరిచయమయ్యారు. ఆ తర్వాత తెల్లవారితే గురువారం చిత్రం చేసిన శ్రీసింహ, ప్రేక్షకులను పెద్దగా మెప్పించలేకపోయాడు. ప్రస్తుతం దొంగలున్నారు జాగ్రత్త, భాగ్ సాలే వంటి ప్రాజెక్ట్స్ శ్రీసింహ చేతిలో ఉన్నాయి. ఈ రెండు సినిమాలు సెట్స్ పై ఉండగానే శ్రీసింహ మరో సినిమాను ప్రకటించి అందరిని ఆశ్చర్యపరిచాడు.
ప్రముఖ టాలీవుడ్ నిర్మాణ సంస్థ వారాహి చలనచిత్ర బ్యానర్ లో శ్రీ సింహ ఒక సినిమాలో నటించబోతున్నారు. ఈ సినిమాకు ఉస్తాద్ అనే టైటిల్ ను ఖరారు చేస్తున్నట్టు మేకర్స్ ఈ రోజే సోషల్ మీడియా వేదికగా ప్రకటించారు. ఈ సినిమాతో ఫణిదీప్ అనే దర్శకుడు టాలీవుడ్ కు పరిచయమవబోతున్నారు. అకీవా మ్యూజిక్ అందిస్తున్నారు. సినిమాకు సంబంధించిన మిగిలిన విషయాలను త్వరలోనే వెల్లడిస్తామని చిత్రబృందం తెలిపింది.