అక్కినేని హీరోలందరూ కలిసి నటించిన చిత్రం మనం. అక్కినేని నాగేశ్వరరావు, నాగార్జున, నాగ చైతన్య, అఖిల్ కలిసి నటించిన ఈ చిత్రాన్ని దర్శకుడు విక్రమ్ కే కుమార్ తెరకెక్కించారు. 2014, మే 23న విడుదలైన మనం చిత్రానికి నేటితో 8ఏళ్ళు పూర్తయిన సందర్భంగా నాగ చైతన్య సోషల్ మీడియా ద్వారా ఈ విషయాన్ని ఫ్యాన్స్ తో పంచుకున్నారు. ప్రస్తుతం విక్రమ్ తో ధూత అనే వెబ్ సిరీస్ లో నటిస్తూ చైతు బిజీగా ఉన్నాడు. మనం సినిమా ఎనిమిదేళ్లు పూర్తయిన సందర్భంగా, ఆ సిరీస్ సెట్స్ లో విక్రమ్ తో కలిసి చైతు ఒక ఫోటో దిగారు. ఆఫోటోను సోషల్ మీడియాలో షేర్ చేసారు. మనం వంటి క్లాసిక్ మూవీని తెరకెక్కించిన ఆ దర్శకుడితోనే తిరిగి పని చేస్తూ, ఆ సినిమా ఎనిమిదేళ్ల గుర్తులను నెమరు వేసుకోవటం చాలా సంతోషంగా ఉంది. ఏఎన్నార్ లివ్స్ ఆన్ అంటూ ఇంస్టాగ్రామ్ లో పోస్ట్ చేసారు. విక్రమ్ కే కుమార్ డైరెక్షన్లో చైతు, రాశీఖన్నా జంటగా నటించిన థాంక్యూ చిత్రం త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది.