బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్ కీలక వ్యాఖ్యలు చేశారు. దక్షిణాది, ఉత్తరాది పరిశ్రమలు అనే తేడా లేదన్నారు. ఆదివారం ఓ ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ.. సినిమాలకు భాషా హద్దులు ఉండకూడదన్నారు. తాను హీరోగా నటించిన 'పృథ్వీ రాజ్' విడుదల కార్యక్రమంలో భాగంగా మీడియాతో మాట్లాడిన ఆయన.. సినీ పరిశ్రమ అంతా ఒక్కటేనని, విడివిడిగా వ్యాఖ్యలు చేయడం తగదన్నారు. సినిమా పరిశ్రమను ఇలా విభజించవద్దని ఆయన తెలిపారు.చంద్రప్రకాష్ ద్వివేది దర్శకత్వం వహించిన పీరియాడికల్ ఫిల్మ్ 'పృథ్వీరాజ్'. ఈ సినిమా జూన్ 3న థియేటర్లలో రిలీజ్ కానుంది.