సూపర్ స్టార్ మహేష్ బాబు, కీర్తి సురేష్ జంటగా నటించిన చిత్రం సర్కారువారిపాట. పరశురామ్ డైరెక్షన్లో పక్కా కమర్షియల్ ఎంటర్టైనర్ గా రూపొందిన ఈ సినిమా మే 12 న విడుదలై తొలిషో నుండే మిక్స్డ్ టాక్ తో రన్ అవుతుంది. కానీ సూపర్ స్టార్ సినిమా కాబట్టి తొలిరోజు అత్యధిక వసూళ్లు వస్తాయని అంటున్నారు. ఇంకా ఈ లెక్కలు బయటికి రాలేదు. అయితే, ఇప్పటీకే చాలా మంది ప్రముఖ సెలెబ్రిటీలు ఈ సినిమాను చూడటం జరిగింది. తాజాగా నందమూరి బాలకృష్ణ కూడా SVP స్పెషల్ షో చూడబోతున్నారట.
రామానాయుడు స్టూడియోస్ లోని రామానాయుడు ప్రివ్యూ థియేటర్ లో బాలకృష్ణకు SVP స్పెషల్ షో వేయనున్నారట. సహజంగా వేరే హీరోల సినిమాలను బాలయ్య చూసిన దాఖలాలు చాలా తక్కువ. తాజాగా బాలయ్య మహేష్ సినిమాను చూస్తుండటంతో ఫ్యాన్స్ ఖుషీ అవుతున్నారు. కానీ మహేష్ మాత్రం అలా కాదు, ఏ కొత్త సినిమా వచ్చినా, అది చిన్న హీరోదా, పెద్ద హీరోదా అనే తేడా లేకుండా చూసి ఆయా సినిమాల చిత్రబృందానికి శుభాకాంక్షలను కూడా తెలియచేస్తారు.
తెలుగు ఓటీటి ఆహా లో స్ట్రీమింగ్ ఐన అన్ స్టాపబుల్ షోలో వీరిద్దరూ కలిసి ఎంతో ఆప్యాయంగా మాట్లాడుకున్న విషయం తెలిసిందే. ఆ రాపో తోనే బాలయ్య మహేష్ సినిమాను చూస్తున్నారని కొంతమంది అభిప్రాయపడుతున్నారు.