కన్నడ టీవీ సీరియల్ నటి రష్మి ప్రభాకర్ వివాహం అంగరంగ వైభవంగా జరిగింది. ఏప్రిల్ 25న సోమవారం బెంగళూరులో ప్రియుడు నిఖిల్ భార్గవ్తో ఆమె పెళ్లి జరిగింది. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో తన పెళ్లి గురించి రష్మి వెల్లడించింది. తనకు నిఖిల్ ఓ కామన్ ఫ్రెండ్ ద్వారా పరిచయం అయ్యాడని తెలిపింది. అతడు ఓ అడ్వర్టైజ్మెంట్ ఏజెన్సీలో పని చేస్తాడని వెల్లడించింది. ఓ ఈవెంట్లో తామిద్దరికీ పరిచయం ఏర్పడిందని, తర్వాత కొన్నాళ్లకే మంచి స్నేహితులుగా మారామని చెప్పింది. ఈ క్రమంలో తనకు నిఖిల్ లవ్ ప్రపోజ్ చేశాడని, తాను కూడా సంతోషంగా ఒప్పుకున్నానని పేర్కొంది. అయితే తమ మధ్య ప్రేమ విషయాన్ని ఓ నెల ముందే ఇంట్లో చెప్పామని, వారంతా ఆశ్చర్యానికి గురయ్యారని వెల్లడించింది.
కోవిడ్ మహమ్మారి వచ్చిన తొలినాళ్లలో లాక్డౌన్ విధించినప్పుడు సేవా కార్యక్రమాలను తామిద్దరం చేపట్టినట్లు రష్మి వెల్లడించింది. చాలా మంది పేదలకు ఆహార పొట్లాలు పంచామని గుర్తు చేసుకుంది. ఇక తన కెరీర్ను పెళ్లయ్యాక కొనసాగించడానికి తన నిఖిల్ అభ్యంతరం తెలపలేదని పేర్కొంది. ఆమె కన్నడ బుల్లితెరపై ప్రసారమయ్యే 'మనసెల్ల నేనే' అనే సీరియల్ నటించింది. ఇటీవల వ్యక్తిగత కారణాలతో దాని నుంచి ఆమె తప్పుకుంది.