ప్రశాంత్ నీల్ డైరెక్షన్ లో టాలీవుడ్ యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ 'సాలార్' సినిమాలో నటిస్తున్న సంగతి అందరికి తెలిసిందే. యాక్షన్ థ్రిల్లర్ ట్రాక్ లో వస్తున్న ఈ సినిమాలో ప్రభాస్ సరసన శృతి హాసన్ నటిస్తుంది. ఈ సినిమా 2023 ఏప్రిల్ లేదా జూన్లో విడుదల కానుంది. ఈ యాక్షన్ ఎంటర్టైనర్ సినిమాలో గోపీ, జగపతిబాబు, పృథ్వీరాజ్ సుకుమారన్ కీలక పాత్రలో కనిపించనున్నారు. ప్రస్తుతం 'సాలార్' షూటింగ్ దశలో ఉంది. తాజాగా ఇప్పుడు ఈ సినిమా ఇంటర్వెల్ సీక్వెన్స్ మేజర్ హైలైట్ గా నిలుస్తుందని వార్తలు వినిపిస్తున్నాయి. ఈ సన్నివేశం ఒక లోయలో జరుగుతుందని అలాగే లోయలో భారీ ఛేజ్ మరియు యాక్షన్ సీక్వెన్స్ ఉండనున్నట్లు సమాచారం. ఈ ఒక్క యాక్షన్ సీక్వెన్స్ కి మేకర్స్ దాదాపు 20 కోట్లు ఖర్చు చేసినట్లు లేటెస్ట్ టాక్. భారతీయ సినిమాలో అత్యుత్తమ ఇంటర్వెల్ ఎపిసోడ్లలో ఒకటిగా నిలిచిపోయే విధంగా ప్రశాంత్ నీల్ దీన్ని షూట్ చేయాలని చూస్తున్నట్లు సమాచారం. రవి బస్రూర్ ఈ సినిమాకి సంగీతం అందిస్తున్నారు. ఈ చిత్రాన్ని హోంబలే ఫిల్మ్స్ పతాకంపై విజయ్ కిరగందూర్ నిర్మిస్తున్నారు.