బాలీవుడ్ ప్రముఖ నిర్మాత, డైరెక్టర్ కరణ్ జోహార్ వివాదాస్పద షో 'కాఫీ విత్ కరణ్' తో చాలా ప్రసిద్ధి చెందాడు. తాజాగా ఇప్పుడు ఈ షో కొత్త సీజన్తో ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతోంది. ఫిలిం ఇండస్ట్రీ లో టాప్ సెలబ్రిటీస్ ఈ షోలో కనిపించనున్నారు. ఈ సీసన్ మొదటి ఎపిసోడ్లో బాలీవుడ్ ప్రముఖ నూతన వధూవరులు అలియా మరియు రణబీర్ కపూర్లు పాల్గొంటారు అని సమాచారం. లేటెస్ట్ రిపోర్ట్స్ ప్రకారం, స్టార్ హీరోయిన్ రష్మిక ఈ షోలో పాల్గొంటున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఇప్పటివరకు తెలుగు ఫిలిం ఇండస్ట్రీ నుండి ప్రభాస్, రాజమౌళి, రానా మాత్రమే ఈ షోలో కనిపించారు.