నటి అమృతారావు అందరికి గుర్తుకు ఉండే ఉంటుంది. అతిథి సినిమాలో మహేష్ బాబు సరసన నటించి పేరు సాధించింది. ఇటీవల ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో ఆమె కీలక విషయాన్ని చెప్పారు. 2014లో అమృతారావుకు ఆర్జే అన్మోల్ తో వివాహమైన విషయం తెలిసిందే. వీరు సంతానం కోసం సరోగసిని ఎంచుకున్నారు. కొన్ని రోజుల తర్వాత శిశువు మరణించిందని ఆవేదన వ్యక్తం చేశారు. అలా ఒక బిడ్డను పోగొట్టుకున్నానన్నారు. 2020లో అమృత గర్భం దాల్చి బిడ్డకు జన్మనిచ్చారు.