టాలీవుడ్ యువ హీరో సత్యదేవ్ నటిస్తోన్న మూవీ గాడ్సే. గోపి గణేష్ పట్టాభి దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీ యాక్షన్ థ్రిల్లర్ కథాంశంతో తెరకెక్కుతోంది. ఐశ్వర్య లక్ష్మీ హీరోయిన్గా నటిస్తోంది. ఈ మూవీ మే 22న ప్రేక్షకుల ముందుకు రానుందని ప్రకటిస్తూ చిత్ర యూనిట్ కొత్త పోస్టర్ను విడుదల చేసింది. సునీల్ కశ్యప్ మ్యూజిక్ అందించాడు.
గతంలో బ్లఫ్ మాస్టర్ అనే సినిమా కోసం గోపీ గణేశ్ దర్శకత్వంలో సత్యదేవ్ వర్క్ చేసిన విషయం తెల్సిందే. వీరిద్దరి కాంబోలో ఇప్పుడు ఈ సినిమా తెరకెక్కింది. గాడ్సే అనే సినిమా తో దర్శకుడు గోపీ గణేష్ మరోసారి విభిన్నంగా సత్యదేవ్ ను చూపించేందుకు సిద్దం అయ్యాడు. విభిన్నమైన కాన్సెప్ట్ తో రూపొందిన ఈసినిమా టైటిల్ తోనే ఆసక్తిని రేకెత్తిస్తోంది అంటూ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
ఐశ్వర్య లక్ష్మి హీరోయిన్ గా రూపొందిన ఈ సినిమా షూటింగ్ కార్యక్రమాలు పూర్తి చేసుకుని విడుదలకు సిద్దం అయ్యింది. రెండు మూడు నెలలకు ఒక సినిమా చొప్పున తీసుకు వచ్చేలా హీరో సత్యదేవ్ బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తూనే ఉన్నాడు. తాజాగా ఆయన చేసిన గాడ్సే సినిమాను మరింత ఆలస్యం చేయకుండా వెంటనే మే నెలలో విడుదల చేయబోతున్నట్లుగా అధికారికంగా ప్రకటన వచ్చింది.
చిత్ర యూనిట్ సభ్యులు మే 20వ తారీకున ఈ సినిమాను విడుదల చేయబోతున్నట్లుగా అధికారికంగా ప్రకటించారు. విడుదల తేదీకి సంబంధించిన పోస్టర్ ప్రస్తుతం ఆసక్తికరంగా మారింది. సినిమాలో గాడ్సే పాత్రలో సత్యదేవ్ కనిపించబోతున్నాడా లేదా మరేదైన పాత్రనా అనే విషయం తేలాల్సి ఉంది. పోస్టర్ లో మాత్రం రెండు తుపాకులు చేతిలో పట్టుకుని చాలా సీరియస్ గా స్టైల్ గా సత్యదేవ్ కనిపిస్తున్నాడు. అన్ని వర్గాల వారిని ఆకట్టుకునే విధంగా ఈ సినిమా ఉంటుందని యూనిట్ సభ్యులు చెబుతున్నారు.