ప్రతి మూడు నెలలకు అభివృద్ధి గణాంకాలు మనకు ఒక పెద్ద పరీక్ష అని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. గ్రీవెన్స్ సెల్ హాల్లో జరుగుతున్న కలెక్టర్ల సదస్సులో చంద్రబాబు మాట్లాడారు. ఎంత వృద్ధి సాధించామో కలెక్టర్ల సదస్సులో తేలిపోతుందన్నారు. ప్రతి శాఖకు కీపెర్ఫార్మెన్స్ ఇండెక్సులు పెట్టుకున్నామని పేర్కొన్నారు. వృద్ధిని శాస్త్రీయంగా నమోదు చేస్తున్నామన్నారు.