ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి నీతి ఆయోగ్ సంపూర్ణ సహకారం అందిస్తుందని, ఏపీతో కలిసి పని చేస్తామని నీతి ఆయోగ్ వైస్ చైర్మన్ రాజీవ్ కుమార్ అన్నారు. ఇక్కడి గ్రీవెన్స్ హాల్ లో జరుగుతున్న కలెక్టర్ల సదస్సులో ఏపీ సీఎంతో కలిసి ఆయన పాలగొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రాష్ట్రాల అభివృద్ధి కోసమే పనిచేస్తున్నామని, టీమిండియాగా పనిచేయాలన్నదే లక్ష్యమని రాజీవ్కుమార్ చెప్పారు. గతంలో ఢిల్లీలో కేంద్రీకృతమైన నిధుల పంపిణీ ప్రక్రియను మార్చామని రాజీవ్కుమార్ పేర్కొన్నారు.