గుజరాత్: అహ్మదాబాద్ చేరుకున్న ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు దంపతులను ప్రధాని మోదీ సబర్మతీ ఆశ్రమానికి తీసుకెళ్లారు. మహాత్మాగాంధీ తిరుగాడిన సబర్మతి ఆశ్రమం ప్రత్యేకతలను ప్రధాని మోదీ దగ్గరుండి నెతన్యాహు దంపతులకు వివరించారు. ఆశ్రమంలో ఉన్న మగ్గంపై ప్రధాని బెంజమిన్ దంపతులు నూలు వడికారు. అనంతరం ఆశ్రమంలోని వరండాపై కూర్చొని సరదాగా కాసేపు ముచ్చటించారు. ఆ తర్వాత సబర్మతీ ఆశ్రమంలో బాపూజీ విగ్రహానికి ఘనంగా నివాళులర్పించారు.