ట్రెండింగ్
Epaper    English    தமிழ்

అమెరికా,రష్యాల సరనన భారత్‌ : చంద్రబాబు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Fri, Jan 12, 2018, 11:44 AM

ఢిల్లీ: భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) మరో అరుదైన మైలురాయి సాధించడం పట్ల సిఎం ముఖ్యమంత్రి చంద్రబాబు సంతోషం వ్యక్తం చేశారు. ప్రయోగం విజయవంతం కావడానికి శ్రమించిన శాస్త్రవేత్తలందరికీ సిఎం అభినందనలు తెలిపారు. నెల్లూరు జిల్లా శ్రీహరికోటలోని షార్‌ కేంద్రం నుంచి వందో ఉపగ్రహాన్ని ప్రయోగించి విజయవంతంగా కక్ష్యలోకి ప్రవేశపెట్టడం గర్వకారణమన్నారు. భారత్‌ తన వందో ఉపగ్రహాన్ని కక్ష్యలోకి ప్రవేశపెట్టడాన్ని ప్రపంచ దేశాలు ఆసక్తిగా గమనించాయన్నారు. గత ఏడాది ఫిబ్రవరిలో ఒకే రాకెట్‌తో 104 ఉపగ్రహాలను ఒకేసారి అంతరిక్షంలోకి తరలించి ఇస్రో రోదసిరంగంలో అగ్రగాములుగా ఉన్న అమెరికా, రష్యాల సరసన భారత్‌ చేరింది. ఈ ఏడాది మొత్తం 31 ఉపగ్రహాలు ప్రయోగించి మరో మారు అంతరిక్ష పరిశోధనా రంగంలో భారత సత్తా ప్రపంచానికి చాటిందన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com