విజయవాడ, మేజర్న్యూస్: విద్యార్థులకు లక్ష్య నిర్దేశం చేసే శక్తి ఒక్క ఉపాధ్యాయుడికి మాత్రమే ఉందని ఏపీ కస్టమ్స కమిషనర్ ఎస్కే రెహమాన్ స్పష్టం చేశారు. ఆదివారం ఉదయం విజయవాడలో బీఈడీ అధ్యాప కుడు దార్ల నరేష్ రచించిన ``సమ్మిళిత విద్య'' పుస్తకాన్ని కమిషనర్ ఆవిష్కరిం చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడు తూ ప్రత్యేక విద్యార్థుల అభ్యసన విధానాల తో రూపొందించిన ఈ పుస్తకం ఉపాధ్యాయ విద్యార్థులకు ఎంతో ప్రయోజకరమన్నారు. ప్రతి ఒక్కరిని ప్రత్యేక అభ్యాసకులుగా భావించే ``సమ్మిళిత విద్య''పై భావి ఉపాధ్యాయులకు సంపూర్ణ అవగాహన అవసరమని అన్నారు. సమ్మిళిత విద్య ద్వారా అందరికీ విద్య అనే ప్రభుత్వ ఆశయం నేరవేరుతుందని ఆయన ఆకాంక్షించారు. సాధారణ విద్యా ర్థులకు ఉపా ద్యాయులు బోధిం చే పద్ధతులతో ప్రత్యేక తరహా విద్యార్థులకు నేర్పించా ల్సిన బోధనా విధానాలపై అవగా హన కలిగివుండాలని సూచించా రు. పుస్తక రచయిత దార్ల నరేశ్ మాట్లాడుతూ బీఈడీ, డీఈడీ విద్యార్థుల అభ్యసనకు అనువుగా ఈ పుస్తకం రూకల్పన చేసినట్లు చెప్పారు. ఈ కార్య క్రమంలో సెన్సార్ బోర్డు మాజీ సభ్యుడు వెచ్చా కృష్ణమూర్తి, విద్యా ప్రముఖులు పి.సూరి, ఆకుల నాగేశ్వరరావు, కస్టమ్స సూపరెంటెండెంట్ గుమ్మడి సీతారామయ్య చౌదరి, సీఐ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.