విశాఖ: నగరంలో భూముల అక్రమాలకు పాల్పడ్డ మంత్రి గంటా శ్రీనివాసరావును మంత్రి పదవి నుంచి బర్త్రఫ్ చేయాలని వైసీపీ ఎమ్మెల్యే రోజా డిమాండ్ చేశారు. మంత్రులు గంటా, నారాయణ కలిసి విశాఖను దోచుకుంటున్నారని ఆరోపించారు. ఆదివారం విశాఖలో పర్యటించిన ఆమె మీడియాతో మాట్లాడుతూ సీఎం చంద్రబాబు, వైసీపీ అధ్యక్షుడు జగన్పై అక్రమంగా కేసులు పెట్టించారని మాజీ సీఎస్ రమాకాంత్ రెడ్డి వ్యాఖ్యలు చూస్తే ఎవరికైనా ఈ విషయం అర్థమవుతుందని అన్నారు. ఓటుకు నోటు కేసు నుంచి తప్పించుకునేందుకు ప్రత్యేక హోదా, విశాఖ రైల్వే జోన్ అంశాలను చంద్రబాబు కేంద్రానికి తాకట్టు పెట్టారని రోజా విమర్శించారు. రైల్వే జోన్ కోసం వైసీపీ చేస్తున్న పోరాటానికి అందరూ మద్దతు ఇవ్వాలని ఆమె కోరారు.