ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ప్రజలను ప్రభుత్వంలో భాగస్వామ్యం చేయడమే జన్మభూమి: సీఎం చంద్రబాబు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Fri, Dec 29, 2017, 01:57 PM

అమరావతి: ప్రజలను ప్రభుత్వంలో భాగస్వాములను చేయటమే జన్మభూమి కార్యక్రమ లక్ష్యమని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. ఇవాళ మంత్రులతో సీఎం చంద్రబాబు సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ 2014 నుంచి ఇప్పటివరకు 4సార్లు జన్మభూమిని నిర్వహించామని, చాలామంది ఈ కార్యక్రమంలో భాగస్వాములయ్యారన్నారు. జన్మభూమి స్ఫూర్తి ప్రతి ఒక్కరిలోనూ ఉండాలని, సొంతూరికి ఏదో ఒకటి చేయాలనే స్ఫూర్తి నింపాలని సీఎం సూచించారు. ఫైబర్‌ గ్రిడ్‌ ద్వారా ప్రతి ఇంటిని విజ్ఞాన కేంద్రంగా మారుస్తామని పేర్కొన్నారు.  వచ్చే ఏడాది జనవరి 2నుంచి ఐదో విడత జన్మభూమి కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు సీఎం చంద్రబాబు తెలిపారు. జనవరి 2నుంచి 11వరకు ఈ కార్యక్రమాలు జరగనున్నాయి. అవి


జనవరి 2న ‘సంక్షేమం-సంతృప్తి’ 
3న ‘ఆరోగ్యం-ఆనందం’
4న ‘స్వచ్ఛాంధ్రప్రదేశ్‌’
5న ‘విద్య-వికాసం’
6న ‘మౌలిక సదుపాయాలు’
7న ‘సహజ వనరులు-అభివృద్ధి’
8న ‘వ్యవసాయం-అనుబంధ రంగాల అభివృద్ధి’
9న ‘సుపరిపాలన-టెక్నాలజీ వినియోగం’
10న ‘విజన్‌ స్వర్ణాంధ్రప్రదేశ్‌-పేదరికంపై గెలుపు’
11న ‘ఆనంద లహరి’ కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు సీఎం చంద్రబాబు తెలిపారు.
Get more interested news in English






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com