ట్రెండింగ్
Epaper    English    தமிழ்

గుర్రంపై ఉన్న స్విగ్గీమ్యాన్ ఎవరో దేశం తెలుసుకోవాలని అనుకుంటోంది: స్వయంగా ప్రకటించిన స్విగ్గీ

national |  Suryaa Desk  | Published : Wed, Jul 06, 2022, 02:34 PM

కొన్ని కంపెనీల బ్రాండ్ లు అనుకోకుండా కొందరి చర్యలవల్ల తెగ పాపులర్ అవుతుంటాయి. ఇప్పటికే పేరు, ప్రఖ్యాతలు సాధించిన స్విగ్గీ తాజాగా మరోసారి పెద్ద ఎత్తున్న పాపులర్ అయింది. దేనివల్లనో తెలుసా...? స్విగ్గీలో ఆర్డర్ చేస్తే గుర్రంపై వచ్చి డెలివరీ చేయడం ఎప్పుడైనా చూశారా..? ముంబైలో ఇటీవలే ఈ వింత చోటు చేసుకుంది. స్విగ్గీ లోగోతో ఉన్న బ్యాగ్ ను భుజాలకు తగిలించుకున్న వ్యక్తి గుర్రం ఎక్కి ముంబై నడిరోడ్డులో.. వర్షానికి తడుస్తూ వెళుతున్న వీడియో ఒకటి ఇటీవలే సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారింది. ఆర్డర్ల డెలివరీకి గుర్రాన్ని ఎలా ఎంపిక చేసుకున్నాడన్నదే ఎక్కువ మందికి వచ్చిన అనుమానం. పెద్ద ఎత్తున నెటిజన్లు దీనికి స్పందిస్తున్నారు. దీంతో స్విగ్గీ కూడా రంగంలోకి దిగక తప్పలేదు.


గుర్రంపై వెళుతున్న వ్యక్తి వివరాలు తమకు తెలియజేస్తే.. వారి స్విగ్గీ ఖాతాలో రూ.5,000 జమ చేస్తామంటూ ప్రకటించింది. ‘‘మా మోనోగ్రామ్డ్ డెలివరీ బ్యాగ్ తగిలించుకున్న గుర్తు తెలియని వ్యక్తి తెల్లటి గుర్రంపై కూర్చుని వెళుతున్న వీడియో మా దృష్టికి వచ్చింది. ఆ వ్యక్తి సొంత ఆలోచన, వాహనం ఎంపికను మేము అభినందించాలని అనుకుంటున్నాం. మీ మాదిరే మేము కూడా ఆ వ్యక్తి ఎవరో గుర్తించలేకున్నాం’’ అంటూ స్విగ్గీ ప్రకటన విడుదల చేసింది. 


‘‘దయచేసి ముందుకు రండి. ఉత్తమ భారత పౌరుడిగా మీ వంతు సహకారం అందించండి. ఎందుకంటే గుర్రంపై ఉన్న స్విగ్గీమ్యాన్ ఎవరో దేశం తెలుసుకోవాలని అనుకుంటోంది’’ అని పేర్కొంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com