న్యూఢిల్లీ : కేంద్ర క్యాబినెట్లో చోటు సంపాదించిన కొత్త మంత్రులను ఇవాళ ప్రధాని నరేంద్ర మోదీ ఉభయసభల్లో పరిచయం చేశారు. మొదట లోక్సభలో, ఆ తర్వాత రాజ్యసభలో పరిచయం చేశారు. ఇటీవల మరణించిన మాజీ ఎంపీలకు నివాళి అర్పించిన తర్వాత లోక్సభను సోమవారం నాటికి వాయిదా వేశారు. రాజ్యసభలోనూ చైర్మన్ వెంకయ్యనాయుడు మృతి చెందిన మాజీ ఎంపీలకు నివాళి అర్పించారు.