కర్నూలు : కర్నూలు జిల్లాలో స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉప ఎన్నికకు ఈసీ షెడ్యూల్ విడుదల చేసింది. ఈనెల 19వ తేదీన ఎన్నికల సంఘం నోటిఫికేషన్ ను విడుదల చేయనుంది. ఈనెల 26వ తేదీ వరకు నామినేషన్ల దాఖలుకు తుది గడువు విధించింది. జనవరి 12న పోలింగ్, జనవరి 16వతేదీన ఫలితం వెలువడనున్నట్లు ఎన్నికల సంఘం తెలిపింది. శిల్పా చక్రపాణిరెడ్డి రాజీనామాతో ఖాళీ ఏర్పడిన స్థానానికి ఎన్నికలు జరుగనున్నాయి.