కోల్కతా: అక్రమంగా రవాణా చేస్తున్న బంగారాన్ని సరిహద్దు భద్రతా దళాల సిబ్బంది పట్టుకున్నారు. ఈ ఘటన పశ్చిమబెంగాల్లో చోటుచేసుకుంది. పశ్చిమబెంగాల్-బంగ్లాదేశ్ సరిహద్దు చెక్పోస్ట్ ప్రాంతం పెట్రాపోల్ వద్ద భద్రతా సిబ్బంది 17 బంగారు బిస్కెట్లను స్వాధీనం చేసుకున్నారు. పట్టుబడ్డ బంగారం విలువ రూ. 49,31,700గా సమాచారం.