అమరావతి : వెలగపూడిలో నూతనంగా నిర్మించిన అసెంబ్లీ భవనంలో సోమవారం ఉదయం 11.30 గంటల నుంచి కార్యకలాపాలను ప్రారంభించేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది. అదే రోజున శాసనసభాపతి కోడెల శివప్రసాదరావు బాధ్యతలు నిర్వర్తించనున్నారు. అలాగే శాసనసభ వ్యవహారాల మంత్రి యనమల రామకృష్ణుడు, అసెంబ్లీ సిబ్బంది కూడా అదే రోజు బాధ్యతలు చేపడతారు. ఇకపై అమరావతి నుంచి పూర్తిస్థాయిలో శాసనసభ వ్యవహారాలు జరిపేందుకు ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసింది