అనంతపురం జిల్లాలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రజాసంకల్ప యాత్ర కొనసాగుతోంది. జగన్ 33వ రోజు పాదయాత్రను రాప్తాడు నియోజకవర్గం చిన్నంపల్లి క్రాస్ రోడ్ నుంచి ప్రారంభించారు. జగన్ పాదయాత్రకు జనం పోటెత్తారు. పాదయాత్ర వద్దకు పెద్దసంఖ్యలో ప్రజలు తరలివచ్చి జగన్కు తమ సమస్యలు చెప్పుకుంటున్నారు. పాదయాత్రలో జగన్ ప్రజల సమస్యలను తెలుసుకుంటూ ముందుకెళుతున్నారు. చిన్నంపల్లి క్రాస్ రోడ్ నుంచి ప్రారంభమైన పాదయాత్ర కురుకుంట బీసీ కాలనీ, సజ్జల కాల్వ క్రాస్ రోడ్డు, వైఎస్సార్ కాలనీ మీదుగా అక్కంపల్లికి చేరుకుంది. పాదయాత్రలో ఉన్న జగన్ కురుగుంటలో అనాథ ఆశ్రమాన్ని సందర్శించారు. పాదయాత్రలో జగన్కు వందేళ్లు పైబడ్డ వృద్ధుడు ఫకీరప్ప కలిసి తన సమస్యను విన్నవించుకున్నాడు. ఇప్పటికీ పెన్షన్ రావడం లేదని ఆవేదన వ్యక్తంచేసిన ఫకీరప్ప పెన్షన్ ఇప్పించి ఆదుకోవాలని జగన్కు అభ్యర్థించాడు.