శ్రీనగర్: జమ్ముకశ్మీర్లోని బందిపొరా జిల్లాలో భారీ హిమపాతం కారణంగా ముగ్గురు జవాన్లు అదృశ్యమయ్యారు. గురేజ్ సెక్టార్లో పహారా కాస్తున్న జవాన్లు కనిపించకుండా పోయినట్లు అధికారులు తెలిపారు. గురేజ్ సెక్టార్లోని బక్తూర్ సమీపంలోని నియంత్రణ రేఖ వద్ద ఉన్న ఆర్మీ స్థావరంలో విధులు నిర్వర్తిస్తున్న జవాన్లు మంగళవారం ఉదయం నుంచి అదృశ్యమయ్యారు. వారి కోసం విస్తృతంగా గాలింపు చర్యలు చేపట్టారు. విపరీతంగా మంచు కురుస్తుండటంతో గాలింపు చర్యలకు ఆటంకం కలుగుతోందని సీనియర్ అధికారి ఒకరు తెలిపారు. సోమవారం గురేజ్ సెక్టార్లోని తులైల్లో గులామ్ మొహ్మద్ ఖాన్ అనే జవాను హిమపాతం వల్ల ప్రాణాలు కోల్పోయారు.