కాకినాడ : కాపులకు రిజర్వేషన్ల విషయంలో చంద్రబాబు చిత్తశుద్ధితో ఉన్నారని నమ్ముదామని కాపు రిజర్వేషన్ల నాయకుడు, మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం అన్నారు. కాపులను బీసీలలో చేర్చి 5 శాతం రిజర్వేషన్లు కల్పించడం ద్వారా ముఖ్యమంత్రి చంద్రబాబు ఒక అడుగు ముందుకు వేశారని ఆయన అన్నారు. ఇక్కడ జరిగిన కాపు జేఏసీ రాష్ట్రస్థాయి సమావేశంలో ఆయన మాట్లాడారు. ఒక వేళ చంద్రబాబు మోసం చేస్తే మనమూ మోసం చేదామని ఆయన అన్నారు.