అమరావతి: ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మంత్రులు, ఉన్నతాధికారులు, శాఖాధిపతులతో సమావేశమయ్యారు. మరింత వృద్ధిరేటు సాధించేందుకు ఏం చేయాలన్న అంశాలపై సమావేశంలో సమాలోచన చేస్తున్నారు. వృద్ధిరేటు, ఫలితాలపై శాఖాధిపతులు నివేదిక ఇచ్చిన అనంతరం చర్చించనున్నారు. 3, 4 త్రైమాసికాల్లో మెరుగైన వృద్ధిరేటుకు అనుసరించాల్సిన వ్యూహాలపై సిద్ధం చేసిన ప్రణాళికలపై ఆయా శాఖల కార్యదర్శులు సమావేశంలో వివరించనున్నారు.