తిరుమల: తిరుమల శ్రీవెంకటేశ్వర స్వామివారిని వైకాపా ఎమ్మెల్యే ఆర్కే రోజా దర్శించుకున్నారు. ఉదయం వీఐపీ ప్రారంభ దర్శన సమయంలో ఆలయానికి చేరుకున్న రోజా స్వామివారి సేవలో పాల్గొన్నారు. తర్వాత రంగనాయకుల మండపంలో అర్చకులు రోజాకు తీర్థ ప్రసాదాలు అందజేశారు. అనంతరం రోజా మీడియాతో మాట్లాడుతూ.. ఎల్1 దర్శనాలు అనర్హులకు కేటాయిస్తున్నారని.. వీఐపీ దర్శనాల్లో అక్రమాలు చోటుచేసుకుంటున్నాయని ఆరోపించారు.