జమ్ముకశ్మీర్ రాష్ట్రంలోని హంద్వారాలో భద్రతా దళాలు-ఉగ్రవాదులకు మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. భద్రతా బలగాల కాల్పుల్లో ముగ్గురు ఉగ్రవాదులు హతమయ్యారు. ఎదురుకాల్పుల్లో ఒక మహిళ మృతి చెందింది. ఇంకా ఉగ్రవాదులు ఉన్నారన్న సమాచారంతో బలగాలు గాలింపు చర్యలు చేపట్టాయి. ఘటనా స్థలంలో భారీగా ఆయుధాలు స్వాధీనం చేసుకున్నారు.