అమరావతి: రేణిగుంటలో ఎలక్ట్రానిక్స్ మ్యానుఫ్యాక్చరింగ్ క్లస్టర్కు కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది. శ్రీ వెంకటేశ్వర మొబైల్ అండ్ ఎలక్ట్రానిక్స్ తయారీ హబ్ ప్రైవేట్ లిమిటెడ్కు కేంద్ర ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖ ఆమోదం తెలిపాయి. సెల్కాన్, కార్బన్, లావా భాగస్వాములుగా క్లస్టర్ను ఏర్పాటు చేశారు. 2015లో రేణిగుంట ఎలక్ట్రానిక్స్ తయారీ క్లస్టర్కు ప్రధాని మోదీ శంకుస్థాపన చేశారు. ఈ మేరకు రేణిగుంట ఈఎంసీని గ్రీన్ ఫీల్డ్ ఎలక్ట్రానిక్ తయారీ క్లస్టర్గా గుర్తిస్తూ కేంద్రం ఆమోదం తెలిపింది.