అమరావతి: ఎలక్ట్రానిక్స్ మ్యానుఫ్యాక్చరింగ్ క్లస్టర్ కేంద్రం ఆమోదం తెలపడంతో కేంద్రమంత్రి రవిశంకర్ప్రసాద్కు మంత్రి లోకేశ్ కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ రాష్ట్రాన్ని మొబైల్, ఎలక్ట్రానిక్స్ తయారీకి హబ్గా తయారుచేయాలన్నదే ప్రభుత్వ లక్ష్యమన్నారు. విడిభాగాల తయారీకి పూర్తి స్థాయి మౌలిక వసతులు కల్పిస్తున్నామన్నారు. దేశంలో తయారయ్యే 10 ఫోన్లలో మన రాష్ట్రంలోనే రెండు తయారవుతున్నాయని, 2019కి రాష్ట్రంలో 5 తయారుకావాలని మంత్రి సూచించారు.