విశాఖ ఏజెన్సీలో కనిష్ఠ ఉష్ణోగ్రతలు పడిపోయాయి. దీంతో ఏజెన్సీ ప్రాంతాల్లో చలితీవ్రత పెరిగిపోయింది. చలితీవ్ర పెరగడంతో భారీగా పొగమంచు కమ్ముకుంది. ఏజెన్సీ ప్రాంతాలైన లంబసింగిలో 5 డిగ్రీల కనిష్ఠ ఉష్ణోగ్రత నమోదు కాగా, చింతపల్లి 7, మినుములూరులో 6 అరకు, పాడేరులో 8 డిగ్రీల డిగ్రీల కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఏజెన్సీ ప్రాంతాల్లో పొగమంచు కమ్ముకోవడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.