విజయవాడ: ఇంద్రకీలాద్రిపై భవానీ దీక్షాపరుల ఇరుముడి విరమణ కార్యక్రమం ప్రారంభమైంది. దీక్ష విరమణలు ఈ నెల 14 వరకు జరగనున్నాయి. రూ.10కోట్లతో భవానీ దీక్షల విరమణకు అధికారులు ఏర్పాట్లు చేశారు. మధ్యాహ్నం 12 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు ఉచిత అన్నప్రసాద వితరణ నిర్వహించనున్నారు. ఆలయానికి భవానీ భక్తులు భారీగా తరలివచ్చారు. దీంతో ఇంద్రకీలాద్రి భక్తజన సంద్రంగా మారింది. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా దేవస్థానం భారీ ఏర్పాట్లు చేసింది.