ఒంగోలు: జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఒంగోలులో పర్యటిస్తున్నారు. ఒంగోలు ఎన్టీఆర్ కళాక్షేత్రంలో పవన్ కల్యాణ్ కృష్ణా జిల్లా పడవ ప్రమాద బాధిత కుటుంబాలను పరామర్శిస్తున్నారు. పడవ ప్రమాదం గురించి బాధిత కుటుంబాలు పవన్కు వివరించారు. ప్రమాద సంఘటనపై పవన్ బాధిత కుటుంబాల సభ్యులను అడిగి తెలుసుకున్నారు. అధికారుల నిర్లక్ష్యం వల్లే పడవ ప్రమాద ఘటన జరిగిందని బాధితులు పవన్కు వివరించారు. అధికారులు హెచ్చరించినా బోటు లోపలికి తీసుకెళ్లారని బంధువులు ఆరోపించారు. ప్రమాదంపై వెంటనే సహాయం అంది ఉంటే తమవారు బతికేవారని బంధువులు ఆవేదన వ్యక్తం చేశారు. బంధువులు పవన్కు మృతుల ఫొటోలు చూపించి కన్నీళ్లు పెట్టుకున్నారు.