జిల్లాలోని రాజంపేట శివారు ఎల్లమ్మ దేవాయలం వద్ద హెలికాప్టర్ నుంచి భక్తులపై పూలవర్షం కురిపించారు. రాజంపేట మండలంలో శ్రీ దేవరకొండ భానుమూర్తి శర్మ 25వ తిరుమల మహాయాత్ర కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో రాజంపేట ఎమ్మెల్యే మేడా మల్లికార్జునరెడ్డితోపాటు పలువురు పాల్గాన్నారు. కాగా... కార్యక్రమానికి విచ్చేసిన భక్తులపై హెలికాప్టర్ ద్వారా పూలవర్షం కురిపించారు.