ప్రభుత్వరంగ సంస్థ ఎయిర్ ఇండియా నిధులకోసం వెంపర్లాడుతున్నది. మూలధన అవసరాల నిమిత్తం అత్యవసరంగా రూ.1,500 కోట్ల నిధులు సేకరించే పనిలో పడింది. ఇలా నిధులను సేకరించడం గడిచిన నాలుగు నెలల్లో ఇది మూడోసారి కానున్నది. సెప్టెంబర్లో రూ.3,250 కోట్లు, అక్టోబర్లో రూ.1,500 కోట్ల నిధులను సేకరించింది. ఈ రుణాల సేకరణకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం మధ్యవర్తిగా ఉండనున్నది. కంపెనీ విడుదల చేసిన బిడ్ డాక్యుమెంట్లో ఈ విషయాన్ని వెల్లడించింది. ఇలా ఇచ్చిన రుణాలను జూన్ 2018లోపు లేదా ఆ తర్వాత తిరిగి చెల్లింపులు జరుపనున్నది. సంస్థకు ప్రస్తుతం రూ.50 వేల కోట్ల అప్పు ఉన్నది.