అనంతపురం: జగన్ తన పాదయాత్రలో ప్రభుత్వంపై అవాస్తవాలను ప్రచారం చేస్తున్నారని మంత్రి కాలవ శ్రీనివాసులు అన్నారు. ఇవాళ ఆర్అండ్బీ అతిథి గృహంలో మంత్రి కాలవ మీడియా సమావేశం నిర్వహించారు. హంద్రీనీవాకు నికర జలాలు అవసరం లేదని బ్రిజేష్కుమార్ ట్రైబ్యునల్కు స్వయంగా వైఎస్ రాజశేఖర్రెడ్డి లేఖ రాశారని మంత్రి తెలిపారు. సర్వే నివేదిక ఆధారంగానే బోయలను ఎస్టీల్లో చేర్చామని, ఏ ప్రభుత్వమూ చేయనంతగా బీసీలకు చంద్రబాబు అండగా నిలిచారని మంత్రి పేర్కొన్నారు.