తిరుమల : తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామిని సినీ నటుడు సప్తగిరి, నిర్మాత శ్రీనివాస్రెడ్డి మంగళవారం ఉదయం దర్శించుకున్నారు. ఇవాళ ఉదయం స్వామి వారికి జరిగే నైవేద్య విరామ సమయంలో స్వామి వారి ఆశీస్సులను సప్తగిరి ఎల్ఎల్బీ చిత్రం టీం పొందారు. వారికి టీటీడీ అధికారులు దగ్గరుండి దర్శనం చేయించారు. రంగనాయకుల మండపంలో వేద ఆశీర్వచనం తీర్థప్రసాదాలు అందజేశారు అర్చకులు. అనంతరం ఆలయం వెలుపల నటుడు సప్తగిరి మీడియాతో మాట్లాడారు. ఈ నెల 7న సప్తగిరి ఎల్ఎల్బీ చిత్రం విడుదల అవుతుందని తెలిపారు. ఈ సందర్భంగా స్వామి వారి ఆశీస్సుల కోసం చిత్రం యూనిట్ సభ్యులు తిరుమలకు వచ్చామని చెప్పారు.