విశాఖ సిగలో మరో హంగు వచ్చి చేరింది. ఆర్కేబీచ్ లో కురుసుర జలాంతర్గామి ఎదురుగా టీయూ-142 యుద్ధ విమానాన్ని ఏర్పాటు చేశారు. నావికాదళంలో 1988లో చేరిన టీయూ-142 యుద్ధ విమానం కార్గిల్ యుద్ధం సహా పలు ఆపరేషన్లలో వీరోచిత పోరాటం చేసింది. 2017 వరకు 29 ఏళ్ల పాటు 30 వేల కిలోమీటర్ల సుదీర్ఘ ప్రయాణం చేసింది. సేవల నుంచి నిష్క్రమించడంతో దీనిని ఆర్కే బీచ్ లో ప్రదర్శన శాలగా ఏర్పాటు చేశారు. దీనిని ఈ నెల 7వ తేదీన రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ దీనిని ప్రారంభించనున్నారు. అనంతరం పర్యాటకులను దీనిని వీక్షించేందుకు అనుమతించనున్నారు.