మాజీ మంత్రి, బిజెపి నాయకుడు యశ్వంత్ సిన్హాను మహారాష్ట్ర పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. విదర్భ ప్రాంతంలో రైతులపట్ల ప్రభుత్వ నిర్లక్ష్య ధోరణికి నిరసనగా అకోలాలో జిల్లా కలెక్టరేట్ ఎదుట రైతుల నిరసన ప్రదర్శనకు యశ్వంత్ సిన్హా నాయకత్వం వహించారు. కాగా యశ్వంత్సిన్హాను, ఆయనతోపాటు 250 మంది రైతులను బొంబాయి పోలీస్ చట్టంలోని 68వ సెక్షన్ కింద అదుపులోకి తీసుకున్నట్లు అకోలా జిల్లా పోలీస్ సూపరింటెండెంట్ రాకేష్ కళాసాగర్ చెప్పారు.